మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు: మార్కో రూబియో
- భారత పర్యటనలో ఉన్న రూబియో
- అమెరికాలో భారతీయ సమాజం గొప్పగా రాణిస్తోందని వ్యాఖ్య
- కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందన్న రూబియో
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి న్యూఢిల్లీలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో పలు విషయాలను పంచుకున్నారు.
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై రూబియో స్పందించారు. అమెరికా సమాజంలోని జాత్యహంకారమే ఈ దాడులకు కారణమనే వాదనను తోసిపుచ్చారు. "ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారు, కొన్ని సంఘటనల ఆధారంగా మొత్తం దేశాన్ని అంచనా వేయలేము" అని వ్యాఖ్యానించారు. అమెరికాలో భారతీయ సమాజం అత్యంత విజయవంతమైన, గౌరవప్రదమైన సమాజంగా ఉందని, వ్యాపారం, సాంకేతికత, వైద్య రంగాల్లో అద్భుతంగా రాణిస్తోందని కొనియాడారు.
మరోవైపు, ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి రాబోయే కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందని రూబియో వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ చాలా వరకు దిగ్బంధించిన హోర్ముజ్ జలసంధిపై ఉన్న ఆందోళనలను ఈ కుదురుతున్న శాంతి ఒప్పందం పరిష్కరిస్తుందన్నారు. ఇరాన్ అణ్వాయుధం గురించి ఇకపై భయపడాల్సిన అవసరం లేని ప్రపంచంలోకి మనం అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్తో శాంతి చర్చలపై పాజిటివ్ పోస్ట్ చేసిన నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.